వ్యక్తిత్వ వికాసం

Reading Time: < 1 minute

ఒక బాలుడికి జట్కాబండి లో ప్రయాణించడం చాలా ఇష్టం. రోజూ బడికి జట్కాలోనే వెళ్లేవాడు. పెద్దయ్యాక ఏం కావాలనుకున్నారని స్కూల్లో టీచరు అడిగారు. 

ఒకరు డాక్టరని, 
ఇంకొకరు ఇంజినీరని, 
మరొకరు లాయరని అన్నారు. ఈ బాలుడు మాత్రం జట్కావాలా అవుతానన్నాడు. టీచరు, పిల్లలు ఘొల్లున నవ్వారు. ఇంటికెళ్లే లోపే ఇది బాలుడి తల్లికి తెలిసి, ప్రశాంత వదనంతో .. బాబూ! పెద్దయ్యాక ఏమవుతావని అడిగింది. స్కూళ్లో చెప్పిందే చెప్పాడు. 

తల్లి: “అలాగే అవుదువు గానీ, ఇలా రా” అంటూ పూజా మందిరం తలుపులు తెరిచి, 
“ఒక్క గుర్రంతో నడిపే బండి కాదు! నాలుగు గుర్రాలు నడిపే బండీకి నువ్వు జట్కావాలావి కావాలి, అదిగో ఆ శ్రీకృష్ణుడి లాగా” అని బోధించింది ఆ తల్లి. ఆ 4 గుర్రాల పేర్లు “ధర్మ, అర్థ, కామ, మోక్షాలనీ” ఆ “బోధించే జట్కావాలా జగద్గురువైన శ్రీకృష్ణుడనీ” చెప్పింది. 

“నువ్వు కూడా జగత్తుకిఈ నాలుగింటిని బోధించే గురువువి కావాలి, సరేనా!” అంటూ అతడి ఆలోచనను మలుపు తిప్పింది. ఆ బిడ్డడే పెద్దయ్యాక వివేకానందుడయ్యాడు. పెంపకం అంటే అదీ! 

పిల్లలు తెలియక తప్పు చేసినా, తప్పు మాట్లాడినా దానిని సరిదిద్దాల్సింది తల్లే! 

అందుకే అమ్మని తొలి గురువు, తొలి దైవం అంటారు.

అమ్మ మాటలో ఎంతో మహత్తు వుంది కదా…

Leave a Reply