ఉచితం, ఉచితం, ఉచితం

Scam Alert @pexels
Reading Time: < 1 minute

ఒక బస్సు విజయవాడ నుండి హైదరాబాద్ వెళుతుంది అందులో చాలామంది ప్రయాణికులు ఎక్కారు..

ఆ బస్సు బయలు దేరుతుంది, కండక్టర్ టికెట్లు తీసుకుంటుండు అందర్నీ టికెట్ ఇవ్వాలని కోరుతూ ముందుకు వస్తున్నాడు..

అలా సగం మంది టికెట్లు తీసుకోగా కండక్టర్ ఒకాయన దగ్గరికి వచ్చాడు ఓ పెద్దాయన టికెట్ తీసుకో అని అడిగాడు.

ఆ పెద్దమనిషి తన జేబులు అన్ని తడుముకొని చూసి అరే అరే నా జేబులో ఐదు వందల రూపాయల నోటు ఉండాలి అది ఎక్కడో పడిపోయింది అని చెప్పాడు.

అప్పుడు కండక్టర్, లేదు నువ్వు కచ్చితంగా టికెట్ తీసుకోవాలి లేదంటే నిన్ను ఈ మధ్యలోనే బస్సులో నుంచి దింపి వేయడం జరుగుతుంది అంటూ ఆ పెద్దమనిషిని తిట్టసాగాడు.

ఆ పెద్దమనిషి, అయ్యా నేను ఒక ముఖ్యమైన పనిమీద వెళుతున్నాను నేను ఈ క్షణాన అక్కడికి వెళ్లకపోతే చాలా నష్టం జరుగుతుంది, నేను కచ్చితంగా వెళ్ళాలి అని కండక్టర్ ని వేడుకుంటూ ఉన్నాడు.

ఇంతలో ఆ బస్సులోనే ఇంకొక  పెద్ద మనిషి-
అయ్యా అతని టికెట్ నేను తీసుకుంటాను అతని తిట్టొద్దు అంటూ రెండవ పెద్ద మనిషి మొదటి పెద్ద మనిషికి టికెట్ తీసుకున్నాడు..

మొదటి పెద్దమనిషి ఆ టికెట్ తీసుకున్న రెండవ పెద్ద మనిషిని చూసి అయ్యా నువ్వు నిజంగా దేవుడవయ్యా అన్ని మొక్కడం మొదలుపెట్టాడు.

నాకు ఈ ప్రయాణం ఎంతో ముఖ్యం ఇంతమంది ఉండగా నువ్వు మాత్రమే నాకు టికెట్ తీసుకున్నందుకు నువ్వు దేవుడవయ్యా అని అన్నాడు.

అలా బస్సు దిగి ఇంటికి పోయిన తర్వాత కూడా బస్సులో ఒక పెద్ద మనిషి నాకు టికెట్ తీసుకున్నాడు అంటూ ఇంకా మనసులో ప్రార్థిస్తూ ఉన్నాడు ఇలా సాయం చేసినందుకు జీవితాంతం ఆ పెద్దమనిషిని మరవకుండా కొలవడం ఈ పెద్దమనిషి పని అయింది..

అయితే తన దగ్గర ఉన్న 500 రూపాయలు ఎక్కడో పడిపోయి అనుకున్నాడు మొదటి పెద్దమనిషి..
కానీ 
రెండో పెద్ద మనిషే ఇతని 500 రూపాయలను దొంగలించింది.. 

ఐదు వందల రూపాయలు దొంగలించి 5 రూపాయల బస్సు టికెట్ తీసుకుని దేవుడవయ్యా అనిపించుకున్నాడు ఆ రెండవ దొంగ పెద్దమనిషి. 

రాజకీయాలలో ఉన్న పెద్ద మనుషులు అందరూ తమ సొంత కష్టార్జితం సంపాదించి తన ఇంట్లో నుంచి ఇస్తున్నట్టుగా-

పించన్ ఇస్తున్నాం
రేషన్ ఇస్తున్నాం
ఉచిత గొర్రెలు
ఉచిత బర్రెలు
ఉచిత కరెంటు ఇస్తున్నాం
ఉచిత భూములు ఇస్తున్నాం
ఉచిత త్రాగునీరు ఇస్తున్నాం
ఉచిత ఇండ్లను ఇస్తున్నాం
మరెన్నో ఇంకా ఉచితం… ఉచితం….. ఉచితం…..

ఇవి మొత్తం ఉచితం అయితే సమాజంలో ప్రజలపై
టాక్సెస్ పెరిగినాయి.
పెట్రోలు పెరిగింది.
బస్సు చార్జీలు పెరిగాయి.
కరెంటు చార్జీలు పెరిగాయి.
రాష్ట్రంలో దేశంలో అప్పులు పెరిగాయి.
ఇలా చాలా చాలా దోపిడీ చేస్తోంది – రాజకీయ వ్యవస్థ

కాబట్టి అల్ ఫ్రీ అనే వాళ్ళని తరిమి కొట్టండి. తెలివిగా ఆలోచించండి..

Leave a Reply